Thursday, August 6, 2026
Homeతెలంగాణకరీంనగర్బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశంను సత్కరించిన మేయర్

బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశంను సత్కరించిన మేయర్

📰 Generate e-Paper Clip

కరీంనగర్, ఆగస్టు 6 (చైతన్యగళం):

కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సాయిని మల్లేశంను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పార్లమెంట్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సాయిని మల్లేశంను శాలువాతో ఘనంగా సత్కరించిన మేయర్, నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన సమర్థవంతంగా పనిచేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, సోమిరెడ్డి వేణు, భూపతి రవీందర్, తోట అనిల్, మేకల వెంకటేష్, ఒంటెల సత్యనారాయణరెడ్డి, బీజేపీ నాయకుడు ముజీబ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!