Friday, July 31, 2026
Homeఆంధ్రప్రదేశ్డైలీ వేజ్ కార్మికుల వేతనాల పెంపు – ఎమ్మెల్యేకి ఘన సన్మానం

డైలీ వేజ్ కార్మికుల వేతనాల పెంపు – ఎమ్మెల్యేకి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

నందికొట్కూరు, జూలై 31 (చైతన్యగళం):
మున్సిపాలిటీ డైలీ వేజ్ కార్మికుల వేతనాలను రూ.9 వేల నుండి రూ.15 వేల వరకు పెంచిన స్థానిక ఎమ్మెల్యే గిత్త జయసూర్యను మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డిను సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ, “మున్సిపాలిటీ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికులకు బ్లౌజులు, నూనె, శానిటైజర్ సరఫరా చేయాలి. చనిపోయిన మున్సిపల్ కార్మికుల కుటుంబాలను ఆదుకొని ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలి” అని వినతిపత్రం అందజేశారు.సిఐటియు నాయకులు మాట్లాడుతూ, “సిఐటియు ఆధ్వర్యంలో అనేక పోరాటాల ఫలితంగా స్థానిక ఎమ్మెల్యే చొరవతో మున్సిపాలిటీ డైలీ వేజ్ కార్మికుల వేతనాలు పెరిగాయి” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం. నాగేశ్వరరావు, టి. గోపాలకృష్ణ, ఉస్మాన్ భాష, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పరమేష్, రామకృష్ణ, రాజు, వెంకటరమణ, ప్రదీప్, అనిల్, రాము, చాంద్ భాషా, తిక్క సామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!