నల్లగొండ,జులై 25 (చైతన్యగళం):
నార్కట్పల్లి – అద్దంకి – మేదరమెట్ల రహదారిపై మర్రిగూడ జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ను రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో నల్గొండ పట్టణవాసులతో పాటు, ఈ రహదారిపై నిత్యం ప్రయాణించే వేలాది మంది వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అత్యంత రద్దీగా ఉండే మర్రిగూడ జంక్షన్లో రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రజలకు సురక్షితమైన అలాగే వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడుతుంది.
మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనడానికి ఈ ప్రాజెక్టు ఒక ప్రత్యక్ష నిదర్శనం. రవాణా వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా నల్గొండ ప్రాంత ఆర్థిక మరియు వాణిజ్య వృద్ధికి ఈ నూతన ఫ్లైఓవర్ రహదారిని సుగమం చేస్తుంది. ఈ అభివృద్ధి కార్యక్రమం పట్ల ప్రాంతీయ ప్రజలు మరియు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్య క్రమంలో నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
