Monday, September 14, 2026
Homeతెలంగాణఐక్యంగా గణేష్‌ ఉత్సవాలను ఘనంగా జరుపుకుందాం

ఐక్యంగా గణేష్‌ ఉత్సవాలను ఘనంగా జరుపుకుందాం

📰 Generate e-Paper Clip

  • భక్తిశ్రద్ధలతో వినాయకుడిని కొలుద్దాం: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌

కరీంనగర్‌, సెప్టెంబరు 14 (చైతన్యగళం): హిందువులంతా సంఘటితంగా ఉండి గణేష్‌ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. హిందువుల ఐక్యతా స్ఫూర్తికి, భక్తికి గణేష్‌ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు.

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గణేష్‌ మండపాల నిర్వహణలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఇంట సుఖసంతోషాలు వెల్లివిరియాలని, తెలంగాణ మరింత సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి గ్రామం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాలని, ప్రజల కష్టాలు తొలగి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.

ధర్మాన్ని కాపాడుతూ సంప్రదాయాలను పరిరక్షించాలని, హిందూ పండుగలను ఘనంగా నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. గణనాథుడి ఆశీస్సులతో తెలంగాణలో ధర్మ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ హిందువులంతా ఐక్యంగా గణేష్‌ ఉత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!