కరీంనగర్, ఆగస్టు 1 (చైతన్యగళం):
ఆషాడమాసం సందర్భంగా కరీంనగర్ భగత్నగర్లోని గోదాంగడ్డలో పోచమ్మ తల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సునీల్ రావు భక్తిశ్రద్ధలతో నెత్తిన బోనం ఎత్తి అందరి దృష్టిని ఆకర్షించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో కలిసి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపులో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన ఈ బోనాల పండుగను ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం లక్ష్మి–మొండయ్య, రజక సంఘ సభ్యులు కొమురయ్య, మహేష్, లక్ష్మణ్, చంద్రయ్య మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
