Sunday, August 2, 2026
Homeతెలంగాణకరీంనగర్ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర

ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర

📰 Generate e-Paper Clip

కరీంనగర్, ఆగస్టు 1 (చైతన్యగళం):

ఆషాడమాసం సందర్భంగా కరీంనగర్ భగత్‌నగర్‌లోని గోదాంగడ్డలో పోచమ్మ తల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సునీల్ రావు భక్తిశ్రద్ధలతో నెత్తిన బోనం ఎత్తి అందరి దృష్టిని ఆకర్షించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో కలిసి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపులో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన ఈ బోనాల పండుగను ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం లక్ష్మి–మొండయ్య, రజక సంఘ సభ్యులు కొమురయ్య, మహేష్, లక్ష్మణ్, చంద్రయ్య మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!