కర్నూలు, జూలై 28 (చైతన్యగళం):
బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపోగు సురేంద్ర నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు భరత్ కుమార్ ఆచారి స్థానిక బిర్లా కాంపౌండ్ కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
నియామకానంతరం సురేంద్ర మాట్లాడుతూ, “విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోసం నిరంతరం పోరాడతాను. రాయలసీమ ప్రాంత సమస్యల పరిష్కారానికి ముందుంటాను” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సమాఖ్య నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
