Thursday, July 23, 2026
Homeతెలంగాణఎంపీల అరెస్టులకు నిరసనగా హుస్నాబాద్‌లో మహాధర్నా 

ఎంపీల అరెస్టులకు నిరసనగా హుస్నాబాద్‌లో మహాధర్నా 

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్, జూలై 22 (చైతన్య గళం):

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది.

ఈ సందర్భంగా నిరసనకారులు ప్లకార్డులతో ఆందోళన చేపట్టి, విద్యార్థులపై లాఠీచార్జికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆ ఘటన నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత నిరసన చేపట్టిన కాంగ్రెస్ నాయకులు, ఎంపీలను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని కేంద్ర ప్రభుత్వం ఖండించకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

నీట్ పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ మహాధర్నాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!