పెద్దపల్లి, జూలై 22 (చైతన్యగళం):
పెద్దపల్లి నియోజకవర్గం జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామంలో శ్రీ మడేలేశ్వర స్వామి బోనాల మహోత్సవం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నల్ల మనోహర్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. “ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలి. సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలి” అని ఆయన ప్రార్థించారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
