Saturday, July 18, 2026
Homeతెలంగాణకరీంనగర్ఉల్లంపల్లిలో భూముల రీ సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ చిత్రా మిశ్రా

ఉల్లంపల్లిలో భూముల రీ సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ చిత్రా మిశ్రా

📰 Generate e-Paper Clip

చిగురుమామిడి, జూలై 17 (చైతన్యగళం):
చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి వ్యవసాయ భూములు, గ్రామ సరిహద్దులు, భూ రికార్డులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో శాలిని, ఎంఆర్ఓ కనకయ్య, ఆర్ఐ నాగరాజు, జీపీఓ రాంబులు, సర్వేయర్ బాలకృష్ణ తదితర అధికారులు రీసర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అలువాల శంకర్ మాట్లాడుతూ, ఉల్లంపల్లిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి భూముల రీసర్వే చేపట్టడం గ్రామ ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా వ్యవసాయ భూముల హద్దులు స్పష్టమై, గ్రామ సరిహద్దులు ఖరారవడంతో పాటు భూ వివాదాలు తగ్గి రైతులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి దృష్ట్యా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అమలు చేస్తున్న జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో శాలిని, ఎంఆర్ఓ కనకయ్య, ఆర్ఐ నాగరాజు, జీపీఓ రాంబులు, సర్వేయర్ బాలకృష్ణతో పాటు సంబంధిత అధికారులందరికీ సర్పంచ్ అలువాల శంకర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!