Thursday, July 16, 2026
Homeతెలంగాణశివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన ఎన్నారై గుమ్మకొండ మధుసూదన్ రెడ్డి

శివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన ఎన్నారై గుమ్మకొండ మధుసూదన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

మర్రిగూడ, జూలై 15 (చైతన్యగళం): మర్రిగూడ మండల కేంద్రంలోని గ్రామంలో నిశ్చరాల గుండ్ల వద్ద నూతనంగా నిర్మిస్తున్న శివాలయ పనులను బుధవారం ఎన్నారై మర్రిగూడ వాసి గుమ్మకొండ మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు గుమ్మకొండ రఘునందన్ రెడ్డి సహకారంతో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది.

ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, “పుట్టిన ఊరికి ఏదో చేయాలనే తపనతో ఈ శివాలయాన్ని నిర్మిస్తున్నాను. ఆలయానికి దాదాపు కోటిన్నర రూపాయల వ్యయం అవుతుంది” అని తెలిపారు.

గ్రామ ప్రజలు ఈ శివాలయ నిర్మాణాన్ని హర్షం వ్యక్తం చేస్తూ, తమ ఊరికి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్న మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, కర్నాటి సంతు మనోహర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!