బనగానపల్లె(చైతన్య గళం):
నంద్యాల జిల్లా బనగానపల్లెలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను ఆయన చేతుల మీదుగా అందించారు.
అనంతరం ప్రజావేదిక సభలో కూటం ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
