తలకొండపల్లి, జూలై 2 (చైతన్యగళం):
తలకొండపల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి నివేదిక మహనీయుల జ్ఞాన బస్సు యాత్ర ముగింపు సమావేశానికి విచ్చేసిన తెలంగాణ స్టేట్ షిప్ మరియు గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ కే. సరిత తిరుపతయ్య యాదవ్ను స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వెంకటపూర్ మాజీ సర్పంచ్ పయ్యావుల రమేష్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యట గీత నరసింహ ముదిరాజ్, నాగర్కర్నూల్ డీసీసీ ఉపాధ్యక్షుడు నాకినమొని వెంకటయ్య యాదవ్, వెల్జాల్ మాజీ ఉప సర్పంచ్ అజీజ్, నాయకులు అవాంఛ నరసింహారెడ్డి, ఎస్. రాజేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.చైర్మన్ సరిత తిరుపతయ్య యాదవ్ను సన్మానించిన సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
