Wednesday, July 15, 2026
Homeతెలంగాణబ్యాంకుల్లో భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టం చేయాలి – సీఐ రంజిత్‌రావు

బ్యాంకుల్లో భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టం చేయాలి – సీఐ రంజిత్‌రావు

📰 Generate e-Paper Clip

సుల్తానాబాద్, జూలై 14 (చైతన్యగళం):
బ్యాంకుల్లో భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఐ రంజిత్‌రావు సూచించారు. సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, “సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థలు నిరంతరం పనిచేయాలి. స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఫైర్ సేఫ్టీ పరికరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. నగదు రవాణా సమయంలో నిర్దేశిత భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి” అని సూచించారు.

అదేవిధంగా, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లావాదేవీలు లేదా వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో ఎస్సై చంద్రకుమార్, పోలీసు సిబ్బంది, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!