కమాన్తో ఆర్టీసీ బస్సులకు ఆటంకం
ఇంద్రానగర్ కాలనీకి నిలిచిన బస్సుల రాకపోకలు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు బోడుప్పల్, సెప్టెంబరు 1 (చైతన్యగళం): బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన కమాన్ తొలగించకపోవడంతో ఇంద్రానగర్ కాలనీకి ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ ముగిసి రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు కమాన్ను తొలగించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గత వారం బోనాల పండుగ సందర్భంగా బోడుప్పల్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు, నాయకులు భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు, కమాన్లు ఏర్పాటు చేశారు. పండుగ ముగిసిన రెండు,...