ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి దగ్గర ధర్నా చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దగ్గరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెళ్లారు.
న్యూఢిల్లీ, జులై 21(చైతన్యగళం): ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి దగ్గర ధర్నా చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దగ్గరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెళ్లారు. రాహుల్ గాంధీతో ఆయన చర్చలు జరిపారు. రాహుల్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆందోళన విరమించాలని కోరారు.
నిన్న( సోమవారం) జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్కు నిరసనగా చేపట్టిన ఈ ధర్నాలో రాహుల్తో పాటు ఖర్గే, కేసీ, ప్రియాంక, పలువురు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలుపుతున్నారు.
