హుస్నాబాద్, జూలై 17 (చైతన్యగళం):
హుస్నాబాద్, అక్కన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన వరుస చోరీల కేసులను పోలీసులు ఛేదించి నిందితుడు రౌతు పవన్ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 11 కిలోల పంచలోహ విగ్రహం, 56 గ్రాముల బంగారం, 76 గ్రాముల వెండి, రూ.23,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన హుస్నాబాద్ ఎస్సై పి. లక్ష్మారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, కానిస్టేబుళ్లు ఎన్. నరేశ్, డి. శ్రీనాథ్తో పాటు సీసీఎస్ బృందాన్ని హుస్నాబాద్ ఏసీపీ సదానందం అభినందించారు. తక్కువ సమయంలో నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీసు సిబ్బంది పనితీరును అధికారులు ప్రశంసించారు.
