Thursday, June 25, 2026
Homeఇంటర్నేషనల్పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం

పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ: జూన్ 22న ఢిల్లీ నుండి అమృత్‌సర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా AI‑479 విమానం తాత్కాలికంగా పాక్ గగనతలంలోకి ప్రవేశించింది. అమృత్‌సర్ విమానాశ్రయంలో పక్షి ఢీకొన్న ఘటన కారణంగా రన్‌వే తనిఖీ జరుగుతుండటంతో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచన మేరకు విమానం హోల్డ్‌లోకి వెళ్లింది. ఈ సమయంలో రాడార్ వెక్టరింగ్ లోపం వల్ల విమానం పాక్ గగనతలంలోకి చేరింది.

పాక్ ATC వెంటనే భారత అధికారులను సంప్రదించి హెచ్చరిక ఇచ్చింది. రెండు దేశాల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సమన్వయం చేసుకుని విమానాన్ని సురక్షితంగా ఢిల్లీకి మళ్లించారు. DGCA ఈ ఘటనపై విచారణ ప్రారంభించి, అమృత్‌సర్ ATC అధికారిని మరియు విమాన సిబ్బందిని తాత్కాలికంగా డ్యూటీ నుండి తప్పించింది.

ఎయిర్ ఇండియా ఈ ఘటనను “మార్జినల్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్”గా పేర్కొంది. ప్రయాణికుల భద్రతే తమకు ప్రాధాన్యం అని స్పష్టంచేసింది. విమానం ఢిల్లీకి చేరిన తర్వాత సాంకేతిక తనిఖీలు జరిపి, నాలుగు గంటల తర్వాత మళ్లీ అమృత్‌సర్‌కు బయలుదేరింది.

ఈ ఘటన భారత్–పాక్ మధ్య కొనసాగుతున్న గగనతల నిషేధం నేపథ్యంలో చోటుచేసుకోవడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. DGCA విచారణ కొనసాగుతుండగా, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ధృవీకరించింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!