Saturday, June 13, 2026
Homeఆంధ్రప్రదేశ్వడదెబ్బతో వృద్ధురాలి మృతి

వడదెబ్బతో వృద్ధురాలి మృతి

📰 Generate e-Paper Clip

తరిగోపుల గ్రామంలో విషాదం

నందికొట్కూరు, జూన్ 13(చైతన్యగళం):నంద్యాల జిల్లా జుపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామానికి చెందిన పేరుమాల్ల చెన్నమ్మ (75) ఎండదెబ్బ కారణంగా మృతి చెందారు. కంటి ఆపరేషన్ అనంతరం కోలుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుమారుడు సిఐ సత్యబాబు, కుమార్తె ప్రమీల హెడ్ నర్స్ తో పాటు కుటుంబ సభ్యులు చెన్నయ్య మరియు వారి కుటుంబానికి గాఢ సానుభూతి తెలిపారు.

ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున, ముఖ్యంగా వృద్ధులు, శస్త్రచికిత్సల అనంతరం కోలుకుంటున్న వారు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండటం, తగినంత నీరు మరియు ద్రవాహారం తీసుకోవడం అత్యంత అవసరమని ప్రమీల (హెడ్ నర్స్, కర్నూలు) సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!