Monday, July 13, 2026
Homeతెలంగాణజ్యోతి గాంధీ స్మారక పురస్కారం అందజేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

జ్యోతి గాంధీ స్మారక పురస్కారం అందజేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

📰 Generate e-Paper Clip

గోదావరిఖని, జూలై 11 (చైతన్యగళం):  

మహిళా మణికి జ్యోతి గాంధీ స్మారక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పురస్కారాన్ని అందజేసి జ్యోతి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న రైజింగ్ తెలంగాణలా, గాంధీగిరి వార్తలు కూడా వేగంగా ప్రజలకు చేరువవుతున్నాయని, నిర్వాహకుడు దయానంద్ గాంధీ కృషిని అభినందించారు. స్థానిక యువత ప్రతిభతో గోదావరిఖని ప్రాంతానికి మంచి పేరు తెస్తున్నారని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!