Tuesday, June 23, 2026
Homeతెలంగాణయువత పట్టుదలతో కృషి చేయాలి - మంత్రి గడ్డం వివేకానంద

యువత పట్టుదలతో కృషి చేయాలి – మంత్రి గడ్డం వివేకానంద

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, జూన్ 22 (చైతన్యగళం): యువత ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద పిలుపునిచ్చారు.సోమవారం మందమర్రి పట్టణంలో ఏర్పాటు చేసిన జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “యువత లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని వాటిని సాధించే దిశగా క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేయాలి. టామ్‌కామ్ సంస్థ ద్వారా విదేశాలలో ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు జర్మన్ భాషను నేర్చుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి” అని సూచించారు.

అతను మరింతగా పేర్కొంటూ, “జర్మనీలో నైపుణ్యం కలిగిన యువతకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వారానికి 32–35 గంటల పని సమయం మాత్రమే ఉండటంతో మిగతా సమయంలో ఇతర నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం పొందిన వారు తమ తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలి. ఇతరులకు ఆదర్శంగా నిలిచి మరింత మందికి అవకాశాలు కల్పించేలా కృషి చేయాలి” అని అన్నారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, “శిక్షణ కేంద్రంలో అందిస్తున్న జర్మన్ భాషా శిక్షణను ఏకాగ్రతతో నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి. శిక్షణ కాలం ముగిసే సరికి భాషపై పట్టు సాధించి నైపుణ్యం సంపాదించాలి. విదేశాలలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని అభివృద్ధి చెందాలి” అని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, శిక్షకులు, యువత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CHAITHANYA GALAM App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!