కరీంనగర్, ఆగస్టు 15 (చైతన్యగళం):
అంబేద్కర్ స్టేడియంలో ఔల్ క్లబ్ ఆధ్వర్యంలో బాస్కెట్బాల్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికితీయడానికి అండర్-14, అండర్-17, అండర్-19 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.
ఈ టోర్నీని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, బిర్లా ఓపెన్ మైండ్స్ చైర్మన్ డి. ప్రశాంత్ రెడ్డి, అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మహిపాల్, కిస్నా జ్యువెలరీ ప్రతినిధి వరుణ్ సంయుక్తంగా ప్రారంభించారు.
జిల్లా వ్యాప్తంగా 25 జట్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నాయి. యువ క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర స్థాయి జట్లకు తీర్చిదిద్దడమే ఈ టోర్నీ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో క్రీడాభిమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.
