కరీంనగర్ రూరల్, ఆగస్టు 1 (చైతన్యగళం):
11 కేవీ ఎల్లమ్మ ఫీడర్ ప్రభావిత ప్రాంతాల్లో లైన్ నిర్వహణ పనుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఏడీఈ పి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ పనుల వల్ల ఆటో నగర్, బైపాస్ రోడ్డు, కోతిరాంపూర్లో భాగం, ఎన్టీఆర్ చౌరస్తా, నా గ్రామ రెస్టారెంట్ ప్రాంతం, గ్యాస్ గోదాం ప్రాంతం ప్రభావితమవుతాయని తెలిపారు.
వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.
