మహబూబాబాద్, జూలై 31(చైతన్యగళం): జిల్లాలో జర్నలిస్టులపై దాడుల నివారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీని పునరుద్ధరించే అంశాన్ని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డా. శబరిష్ ఐపీఎస్ తెలిపారు.
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్జేయూ) రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ నాయకత్వంలో జిల్లా యూనియన్ ప్రతినిధులు గురువారం ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల దాడుల నివారణ కమిటీని పునరుద్ధరించాలని వారు కోరారు. ఈ సందర్భంగా స్పందించిన ఎస్పీ డా. శబరిష్ మాట్లాడుతూ… కమిటీ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను పరిశీలించి, పునరుద్ధరణకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో టీఎస్జేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షుడు చిర్రగొని ఉదయ్ ధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుగంటి సతీష్ చారి తదితరులు పాల్గొన్నారు.
