కరీంనగర్, జూలై 11 (చైతన్యగలం):
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎలగందుల గ్రామ శివారులో నిర్వహిస్తున్న జూద స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించి ఐదుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు.దాడిలో రూ.10,100 నగదు, 5 మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లు, 1 కారు స్వాధీనంచేసుకున్నారు.నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ప్రజలు చట్టవిరుద్ధమైన జూద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని కరీంనగర్ పోలీసులు సూచించారు.
