జగిత్యాల, జూలై 11 (చైతన్యగళం):
జగిత్యాల పావని కంటి ఆసుపత్రి, ఆపి మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 12 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత మందులు, కంటి అద్దాలు పంపిణీ చేశారు.
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులను పరామర్శించారు. ఆయన సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డా. విజయ్, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
