నందికొట్కూరు, జూలై 5 (చైతన్యగళం): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం భాగంగా నందికొట్కూరు పట్టణంలోని 70వ బూత్, 2వ సచివాలయం పరిధిలో ఆదివారం సర్వే జరిగింది.
బీఎల్వో మాధవస్వామి, వైఎస్ఆర్సిపి టౌన్ వైస్ సెక్రటరీ ఆయిల్ షఫీ ఇంటింటికీ వెళ్లి ఓటర్ వివరాలను పరిశీలిస్తూ, అవసరమైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేశారు. ఈ ప్రక్రియను నందికొట్కూరు మండల తహశీల్దార్ శ్రీనివాసరావు ప్రత్యక్షంగా పరిశీలించారు.
