Monday, June 29, 2026
Homeఆరోగ్యంపల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించిన జిల్లా కలెక్టర్

పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించిన జిల్లా కలెక్టర్

📰 Generate e-Paper Clip

మహబూబాబాద్, జూన్ 28 (చైతన్య గళం): జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ఐదేళ్లలోపు ప్రతి చిన్నారి పోలియో బారిన పడకుండా ఉండేందుకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచి భవిష్యత్తుకు రక్షణ కవచంలా నిలుస్తాయి” అని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.మొదటి రోజు వేయించలేని వారికి, తర్వాత రెండు రోజుల పాటు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు అందజేస్తారని కలెక్టర్ తెలిపారు.కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!