రామగుండం, సెప్టెంబర్ 8 (చైతన్య గళం): తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సెంట్రల్ హాల్ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ప్రారంభించారు. మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరుతో ఏర్పాటు చేసిన ఈ సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి నిర్వహించిన అల్పాహార కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.
