Tuesday, July 28, 2026
Homeతెలంగాణకొండగట్టు గిరి ప్రదక్షిణలో పాల్గొననున్న వెలిచాల రాజేందర్ రావు

కొండగట్టు గిరి ప్రదక్షిణలో పాల్గొననున్న వెలిచాల రాజేందర్ రావు

📰 Generate e-Paper Clip

కరీంనగర్, జూలై 28 (చైతన్యగళం):
గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం 5 గంటలకు ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని డిసిసి అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

ఈ గిరి ప్రదక్షిణలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పాల్గొననున్నారు. బుధవారం ఉదయం 4:30 గంటలకు ఆయన తీగలగుట్టపల్లిలోని విల్లా నుంచి కొండగట్టుకు బయలుదేరి వెళ్లనున్నారు.

సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు ప్రజలు సుభిక్షంగా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ గిరి ప్రదక్షిణలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, అభ్యర్థులు, సర్పంచులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!