ఖానాపూర్, ఆగస్టు 3 (చైతన్యగళం): ఖానాపూర్ పట్టణంలో కోతుల బెడదను తగ్గించేందుకు మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కోతులు పట్టే సిబ్బందితో కలిసి పట్టణంలోని అన్ని వార్డుల్లో కోతులను పట్టి పునరావాస కేంద్రాలకు పంపే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే పట్టణంలో కోతుల సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముహమ్మద్ షోయబ్ హుస్సేన్, కౌన్సిలర్ నాయకులు ప్రకాష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు మనోజ్, మల్లేష్, అజీమ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
