మర్రిగూడ, జూన్ 19 (చైతన్యగళం): మర్రిగూడ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈ నెల 21న ప్రథమ పుష్కర వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి గజవెల్లి రవికుమార్ గుప్త మాట్లాడుతూ, “భక్తులు విచ్చేసి వాసవి మాత ఆశీస్సులు పొందగలరు” అని తెలిపారు.వాసవి మాత జయంతి వేడుకల అనంతరం మొదటిసారిగా జరగనున్న ఈ పుష్కర వార్షికోత్సవం కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుతున్నారు.