22-ఏ భూముల సమస్యను పరిష్కరించాలి
భూదాన్, సీలింగ్, మిగులు భూముల వివరాలు బహిర్గతం చేయాలి కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓకు టీడీపీ నేతల వినతిపత్రం మహబూబాబాద్, సెప్టెంబర్ 17(చైతన్యగళం): సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు టీడీపీ మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్ కొండపల్లి రామచందర్రావు ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా 22-ఏ నిషేధిత భూములు, భూదాన్ భూములు, సీలింగ్ భూములు, మిగులు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా...