ఎన్‌ఎస్‌యూఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా భల్లెం చంటి

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. మహబూబాబాద్, సెప్టెంబర్ 12(చైతన్యగళం): నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా భల్లెం చంటి నియమితులయ్యారు. ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖర్ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి మార్గదర్శకత్వంలో ఆయన నియామకం జరిగింది. భల్లెం చంటి నియామకానికి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రు నాయక్,...