జిన్నింగ్ మిల్స్ కార్యదర్శిగా ఎన్నికైన సత్యనారాయణకు ఘన సన్మానం
కరీంనగర్, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): కరీంనగర్ జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నికైన బిక్కుమళ్ల సత్యనారాయణను వైశ్య సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కరీంనగర్ వైశ్య భవన్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చీదుర సురేష్ ఆధ్వర్యంలో సత్యనారాయణను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వైశ్య సేవా కేంద్రం ప్రతినిధులు మాట్లాడుతూ జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ కార్యదర్శిగా సత్యనారాయణ ఎన్నిక కావడం అభినందనీయమని, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ సంఘం అభివృద్ధికి కృషి...