CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 2:59 pm Posted by : rakeshkashaveni12@gmail.com

సర్పంచుల ముందస్తు అరెస్ట్‌ – ఇదేనా ప్రజాపాలన

సైదాపూర్ మండలం సెప్టెంబర్ 8(చైతన్యగళం):

నిరసన కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జాగిరిపల్లి సర్పంచ్‌ తొంట రజనీకాంత్‌, వెన్నంపల్లి సర్పంచ్‌ మోలుగురి చిరంజీవి, గర్రెపల్లి సర్పంచ్‌ మాచమల్ల శ్రీకాంత్‌లను ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు నిరసనకు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని వారు ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడమేనా.. ఇదేనా ప్రజాపాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదుపులోకి తీసుకున్న సర్పంచులు, నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.