యువ సమరభేరి సభలో కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

కరీంనగర్, సెప్టెంబర్ 5 (చైతన్యగళం): కరీంనగర్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ యువ సమరభేరి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన గాడి తప్పిందని కేటీఆర్‌ ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాల హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఉద్యోగాలు అడిగిన యువతపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేశారని ఆరోపించారు ఎన్నికల...