ఆరు గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ పోరుబాట
కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి,మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వెల్దండ, సెప్టెంబర్ 3 (చైతన్యగళం): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వెల్దండ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గురువారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్...