హనుమాన్‌ దేవాలయంలో ప్రత్యేక పూజలు

హనుమాన్‌ దేవాలయంలో ప్రత్యేక పూజలు యాచారం, సెప్టెంబర్‌ 1 (చైతన్యగళం): యాచారం మండలంలోని పెరుమాండ్ల ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీఆర్‌జీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు ప్రొద్దుటూరి రవీందర్‌గుప్త తన తండ్రి ప్రొద్దుటూరి వెంకన్నగుప్త జ్ఞాపకార్థం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కొంగల శ్రీశైలం పూజా సామగ్రిని అందజేశారు. సరికొండ (పల్లెచెల్కతండా) మాజీ ఉపసర్పంచ్‌ వస్లావత్‌ నవీన్‌ నాయక్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. ఆలయ పైకప్పు రేకుల ఏర్పాటుకు భక్తుడు సంజీవ్‌ రూ.6 వేల విరాళాన్ని...