రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి – సీఎం రేవంత్రెడ్డి
సీఎం రేవంత్రెడ్డితో రైతు కమిషన్ బృందం భేటీ మైనర్ ఇరిగేషన్ నివేదిక అందజేత.. రెండేళ్ల ప్రగతిపై చర్చ హైదరాబాద్, ఆగస్టు 29 (చైతన్యగళం): రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో రైతు కమిషన్ బృందం విస్తృతంగా చర్చించింది. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం జరిగిన ఈ సమావేశం రెండు గంటలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా రైతు కమిషన్ రూపొందించిన మైనర్ ఇరిగేషన్ నివేదికను కమిషన్ చైర్మన్, సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అందజేశారు. రాష్ట్రంలోని చిన్నతరహా...