CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 1:21 pm Posted by : rakeshkashaveni12@gmail.com

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లు పట్టివేత

కరీంనగర్ , ఆగస్టు 22 (చైతన్యగళం): అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో మానకొండూరు మండలం శ్రీనివాస్‌నగర్‌కు చెందిన వరికుప్పల రాజశేఖర్, తన యజమాని వరికుప్పల తిరుపతి ఆదేశాల మేరకు మానేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తుండగా గుంటూరుపల్లి స్టేజీ, బొమ్మకల్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అదే విధంగా మానకొండూరు మండలం లింగాపూర్‌కు చెందిన గాలిపల్లి గణేష్, తన యజమాని పిట్టల కృష్ణ ఆదేశాల మేరకు ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అలాగే కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తికి చెందిన బిజిలి శ్రీనివాస్ మానేరు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్‌లో కరీంనగర్ వైపు తరలిస్తుండగా గోపాల్‌పూర్ ఎక్స్‌రోడ్, దుర్షేడ్ గ్రామం వద్ద పోలీసులు పట్టుకున్నారు మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి, నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను కోర్టుకు పంపించినట్లు పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే సస్పెక్ట్ షీట్లు తెరుస్తామని కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.