వైభవంగా నూతన వైశ్య భవన్ ఏసీ కన్వెన్షన్కు భూమిపూజ
వైశ్యుల ఐక్యత, సేవా స్ఫూర్తి అభినందనీయం: బండి సంజయ్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా నిర్మాణం: గంగుల కమలాకర్ కరీంనగర్, ఆగస్టు 19 (చైతన్యగళం): కరీంనగర్ నగరంలో నూతనంగా నిర్మించనున్న వైశ్య భవన్ ఏసీ కన్వెన్షన్కు బుధవారం వైభవంగా భూమిపూజ నిర్వహించారు. వైశ్య సేవా కేంద్రం అధ్యక్షుడు చిదుర సురేష్ అధ్యక్షతన పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం మంగళంపల్లి శ్రీనివాస శర్మ వేదమంత్రోచ్చరణల నడుమ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భూమిపూజ మహోత్సవానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే...