జమ్మికుంటలో ఆహార భద్రత అధికారుల ప్రత్యేక తనిఖీలు
పలు ఆహార పదార్థాల నమూనాల సేకరణ జమ్మికుంట , ఆగస్టు 18 (చైతన్యగళం): జమ్మికుంట పట్టణంలో ఆహార భద్రత శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కొండూరు కాంప్లెక్స్ ప్రాంతంలోని వివిధ కిరాణా హోల్సేల్ దుకాణాలతో పాటు గ్రెయిన్ మార్కెట్ రోడ్ పరిధిలోని ఆయిల్ మిల్లులను అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న పలు ఆహార పదార్థాల నమూనాలను అధికారులు సేకరించారు. జమ్మికుంటలోని రెండు ఆయిల్ మిల్లుల్లో ఉత్పత్తి చేసిన వేరుశెనగ నూనెతో పాటు శనగపప్పు, వేరుశెనగలు, వివిధ రకాల కాన్ఫెక్షనరీ...