సైబర్ నేరాలపై అప్రమత్తతతోనే భద్రత
సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించాలి: పోలీసులు మహబూబాబాద్, ఆగస్టు 18(చైతన్యగళం): సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని మహబూబాబాద్ పోలీసులు సూచించారు. జిల్లా ఎస్పీ డా. పి. శబరిష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్–1లో షీ టీం, సైబర్ క్రైమ్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం ఎస్ఐ సునంద, సైబర్ క్రైమ్ ఎస్ఐ కరుణాకర్ విద్యార్థులకు సైబర్ నేరాల...