CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 4:56 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఎలిగేడు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా వినోద్

ఎలిగేడు, ఆగస్టు 16(చైతన్యగళం):
ఎలిగేడు మండల కేంద్రంలో శనివారం జరిగిన ఎమ్మార్పీఎస్ కార్యవర్గ ఎన్నికల్లో బాసంపల్లి వినోద్ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అధికార ప్రతినిధిగా గోషికే తీతు కుమార్, గౌరవ అధ్యక్షుడిగా కవ్వంపల్లి సంపత్ కుమార్ ఎన్నికయ్యారు.మండల ఇంచార్జ్ తిప్పారపు లక్ష్మణ్ ఎన్నికల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ చెన్నూరి శ్రీనివాస్, సర్పంచ్ కవ్వంపల్లి బాపయ్య, సీనియర్ నాయకులు న్యాతరి పోచాలు, కవ్వంపల్లి నారాయణ, మల్లారపు అంజయ్య, రాయపాక మనోహర్ తదితరులు పాల్గొన్నారు.ఆదివారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు వినోద్‌ను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు న్యాతరి పోచాలు, బాసంపల్లి రాజేశం తదితరులు ఉన్నారు.