సిద్దిపేట జిల్లా టీజేఏ అధ్యక్షుడిగా సొల్లోటి ఆంజనేయులు
సిద్దిపేట, ఆగస్టు 12 (చైతన్యగళం ): తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీజేఏ) సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా సొల్లోటి ఆంజనేయులు నియమితులయ్యారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. టీజేఏను జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరి సహకారంతో పనిచేస్తానన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా...