సిద్దిపేట, ఆగస్టు 6 (చైతన్యగళం):
సిద్దిపేట ఐడీఓసీ సముదాయంలోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త కీర్తిశేషులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) డి. నాగరాజమ్మ, ప్రత్యేక ఉప కలెక్టర్ విజయలక్ష్మి హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సయ్యద్ రఫీక్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎం.డి. హమీద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.