పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తి అరెస్ట్

గన్నేరువరం, ఆగస్టు 5 (చైతన్య గళం): ఖాసింపేట్ గ్రామానికి చెందిన కయ్యం సంపత్‌పై పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అరెస్టు చేసినట్లు గన్నేరువరం ఎస్సై తెలిపారు. గత నెల 20న భూ వివాదానికి సంబంధించి సంపత్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. విచారణ తనకు అనుకూలంగా జరగడం లేదంటూ పోలీసులను బెదిరిస్తూ వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసినట్లు తెలిపారు. అనంతరం సోమవారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు వచ్చి విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదు...