రైతులకు యూరియా కొరత రాకుండా చూడాలి – దశరథ్ నాయక్

కడ్తాల్, జూలై 31 (చైతన్యగళం): రైతులకు యూరియా అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాజీ జెడ్పిటిసి, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్ స్పష్టం చేశారు. కడ్తాల్ మండల కేంద్రంలోని హక సెంటర్‌లో యూరియా బ్యాగులు కొనుగోలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, “దాదాపు 15 రోజుల క్రితం ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసిన యూరియా బ్యాగులు ఈరోజు లభించాయి. కానీ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఈ ఆన్‌లైన్ విధానం వల్ల ఇబ్బందులు పడుతున్నారు” అని తెలిపారు....