కరీంనగర్ ,జులై 29(చైతన్యగళం):
కరీంనగర్ నగరంలోని ప్రసిద్ధ యజ్ఞ వరాహస్వామి దేవాలయ వెబ్సైట్ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఆలయ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వెబ్సైట్ ద్వారా భక్తులు ఆలయ కార్యక్రమాలు, పూజా వివరాలు మరియు ఇతర సమాచారాన్ని ఇంట్లోనే ఉండి సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్, కార్పొరేటర్ తోట అనిల్, దేవాలయ కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.