జూలై 31లోగా ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాలి -జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరిష్‌

మహబూబాబాద్‌, జూలై 29(చైతన్యగళం): జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) సవరణ, డిజిటలైజేషన్‌ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌, మెజిస్ట్రేట్‌ స్నేహ శబరిష్‌ సూచించారు.కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి ఓటరు తమకు అందిన ఎన్యూమరేషన్‌ ఫారాన్ని పూర్తిచేసి జూలై 31లోగా సంబంధిత బూత్‌ లెవల్‌ అధికారులకు (బీఎల్‌ఓ) లేదా సంబంధిత కార్యాలయాల్లో అందజేయాలని కోరారు. ఓటర్లు ఎలాంటి జాప్యం చేయకుండా ఫారాలను...